బీజేపీ ఎంపీ కిషన్ రెడ్డి మాట్లాడుతూ… టిఆర్ఎస్ సహాయంతో మజ్లీస్ పార్టీ భయానక పరిస్థితులు సృష్టిస్తుంది. టిఆర్ఎస్ ప్రభుత్వ అండ తో కలహాలకు కారకులైన మజ్లీస్ నేతలను వదిలేస్తున్నారు. దాడుల్లో హిందువులు నష్ట పోతున్నారు. భాద్యులపై చర్యలు తీసుకోకుండా, పోలీసుల చేతికి సంకెళ్లు వేసినట్లుగా ఉంది. మతకలహాల వీడియోలు ఉన్నా, పోలీసులు పట్టించుకోవడం లేదు అన్నారు. మహిళలు,బాలికలపై అత్యాచారాలు జరిగితే మజ్లీస్ పార్టీకి భయపడి పోలీసులు కేసు పెట్టలేదు. టిఆర్ఎస్ నేతలు, మంత్రులు మజ్లీస్ పార్టీకి అండగా ఉండి పోలీసులను అడ్డుకుంటున్నారు. మజ్లీస్ పార్టీకి బలం ఉన్న ప్రాంతాల్లోనే దాడులు ఎందుకు జరుగుతున్నాయి. బాధితులకు నష్టపరిహారం కూడా ప్రభుత్వం ఇవ్వడం లేదు. ప్రజలకు కేసీఆర్ కుటుంబం, టిఆర్ఎస్ పార్టీ రక్షణ కల్పించాల్సింది పోయి ఇతర అంశాలను లేవనెత్తుతూ ఓట్లు పొందాలని చూస్తుంది. బైంసా లో ఘటనలు, ఫిర్యాదులపై పూర్తి నివేదిక అందించాలని కేంద్ర హోం శాఖ కార్యదర్శి రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరబోతున్నారు అని పేర్కొన్నారు.
previous post
next post