ఏపీ సర్కారు నిర్మాణాలపై నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు కేంద్ర సాంస్కృతిక శాఖకు లేఖ రాశారు. విశాఖలో చారిత్రక ప్రదేశాల్లో నిర్మాణాలు చేపడుతోందని లేఖలో పేర్కొన్నారు. ఆ నిర్మాణాలను నిలిపివేసేలా ఆదేశాలు ఇవ్వాలంటూ తొట్లకొండ బౌద్ధారామం ఉన్న కాపులుప్పాడ ప్రాంతంలో వీఐపీ అతిధి గృహం నిర్మాణానికి భూమిపూజ చేశారని వెల్లడించారు.
తొట్లకొండను 1978లో చారిత్రక ప్రదేశంగా పేర్కొన్నారని, బఫర్ జోన్ కు 300 మీటర్ల దూరంలో రక్షితప్రాంతంగా గుర్తించాలని సుప్రీంకోర్టు కూడా చెప్పిందని తెలిపారు. ఇప్పుడు సీఎం జగన్ సర్కారు కేంద్రం నిబంధనలను అతిక్రమిస్తోందని తెలిపారు. చారిత్రక ప్రాంతాల్లో నిర్మాణాలు వెంటనే ఆపాలని తన లేఖలో కోరారు.
ఏపీ రాజకీయాల్లో ఒకే కులానికే ప్రాధాన్యత: శివరాజ్ సింగ్ చౌహాన్