telugu navyamedia
తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

రైతాంగానికి కష్టాలు రాకుండా అన్ని చర్యలు: హరీశ్‌రావు

harish rao trs

రైతాంగానికి ఎలాంటి కష్టాలు రాకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నామని తెలంగాణ మంత్రి హరీశ్‌రావు అన్నారు. ఆదివారం వరంగల్‌లోని భద్రకాళీ అమ్మవారిని మంత్రి దర్శించుకున్నారు. ఈ సందర్భంగా హరీశ్‌రావు మాట్లాడుతూ రాష్ట్రంలో మంచిగా వర్షాలు కురిసి, సమృద్ధిగా పంటలు పండి రైతాంగం అంతా నిత్యం సుఖసంతోషాలతో ఉండేవిధంగా ముఖ్యమంత్రి కేసీఆర్‌, రాష్ట్ర ప్రభుత్వం ముందుకు సాగుతుందని ఆయన అన్నారు.

ముఖ్యమంత్రి కేసీఆర్‌ పాలనలో తెలంగాణ రాష్ట్రం దేశంలో అత్యద్భుతమైన ప్రగతిని అందిస్తూ మిగితా రాష్ట్రాలకు ఆదర్శంగా నిలుస్తున్నదని ఆయన అన్నారు. రైతులకు 24 గంటల ఉచిత కరెంట్‌, మిషన్‌ కాకతీయ వంటి పథకాల ఫలితాలను రైతులు అనుభవిస్తున్నారని, రేపు భవిష్యత్‌లో రైతులకు మద్దతు ధర ఇచ్చేవిధంగా ముఖ్యమంత్రి కేసీఆర్‌ అన్ని చర్యలు తీసుకుంటారన్నారు.

Related posts