తెలంగాణ లోక్సభ ఎన్నికల్లో టీఆర్ఎస్ ఖాతా తెరిచింది. రెండు ఎంపీ సీట్లను కైవసం చేసుకొంది. మరో ఆరు స్థానాల్లో ముందంజలో కొనసాగుతోంది. జాతీయ పార్టీలైన కాంగ్రెస్, బేజీపీ చెరో నాలుగు స్థానాల్లో ముందంజలో ఉన్నాయి. మెదక్లో టీఆర్ఎస్ అభ్యర్థి కొత్తప్రభాకర్ రెడ్డి 3 లక్షలకుపైగా ఓట్ల మెజారిటీతో గెలుపొందగా, నాగర్కర్నూల్లో టీఆర్ఎస్ అభ్యర్థి పి.రాములు లక్షకుపైగా మెజారిటీతో విజయం సాధించారు.
మల్కాజ్గిరిలో కాంగ్రెస్ ఆధిక్యంలో కొనసాగుతోంది. ఇక్కడ కాంగ్రెస్ నుంచి రేవంత్ రెడ్డి బరిలో ఉన్నారు. నల్గొండలో కాంగ్రెస్ ఆధిక్యంలో కొనసాగుతోంది. భువనగిరి, చేవెళ్ల స్థానాల్లో కాంగ్రెస్ దూసుకుపోతోంది.కరీంనగర్, సికింద్రాబాద్, నిజామాబాద్, ఆదిలాబాద్ స్థానాల్లో బీజేపీ ముందంజలో ఉంది.