telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

ప్రభుత్వ తీరుపై గవర్నర్ కు చంద్రబాబు ఫిర్యాదు

chandrababu

వైసీపీ ప్రభుత్వం అనుసరిస్తున్న తీరుపై ఏపీ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ కు టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు ఫిర్యాదు చేశారు. గత కొన్నిరోజులుగా ఏపీ శాసనసభ, శాసనమండలి సమావేశాల్లో ప్రభుత్వ వైఖరిపై గవర్నర్ కు వివరించారు. ఈ సాయంత్రం ఆయన గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ను కలిశారు.

మండలిలో వైసీపీ మంత్రుల తీరుతెన్నులకు సంబంధించిన ఓ పెన్ డ్రైవ్ ను గవర్నర్ కు అందజేశారు. మంత్రులు చైర్మన్ పోడియంను ముట్టడించి, అనుచితంగా ప్రవర్తించారని చంద్రబాబు ఆరోపించారు. ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాలని గవర్నర్ కు ఆయన విజ్ఞప్తి చేశారు.

Related posts