వైసీపీ ప్రభుత్వం అనుసరిస్తున్న తీరుపై ఏపీ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ కు టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు ఫిర్యాదు చేశారు. గత కొన్నిరోజులుగా ఏపీ శాసనసభ, శాసనమండలి సమావేశాల్లో ప్రభుత్వ వైఖరిపై గవర్నర్ కు వివరించారు. ఈ సాయంత్రం ఆయన గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ను కలిశారు.
మండలిలో వైసీపీ మంత్రుల తీరుతెన్నులకు సంబంధించిన ఓ పెన్ డ్రైవ్ ను గవర్నర్ కు అందజేశారు. మంత్రులు చైర్మన్ పోడియంను ముట్టడించి, అనుచితంగా ప్రవర్తించారని చంద్రబాబు ఆరోపించారు. ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాలని గవర్నర్ కు ఆయన విజ్ఞప్తి చేశారు.