నిరుద్యోగులకు ఏపీపీఎస్సీ శుభవార్త చెప్పింది. వచ్చే నెలలో గ్రూప్-2 నోటిఫికేషన్ విడుదల చేస్తామని ఏపీపీఎస్సీ చైర్మన్ ఉదయభాస్కర్ వెల్లడించారు. అంతేకాకుండా రెండు నెలల్లోపు 9 నోటిఫికేషన్లు విడుదల చేస్తామని తెలిపారు. గతేడాది నవంబర్ నుంచి 33 నోటిఫికేషన్లు ఇచ్చామని చెప్పారు. పంచాయతీ సెక్రటరీ పరీక్షలు వాయిదా పడవని తెలిపారు. ఈ నెల 21న పంచాయతీ సెక్రటరీ స్క్రీనింగ్ టెస్ట్ నిర్వహిస్తామని ఆయన పేర్కొన్నారు. ఓఎంఆర్ తరహాలోనే స్క్రీనింగ్ టెస్ట్ ఉంటుందని, 5 లక్షల మంది పంచాయతీ సెక్రటరీ పరీక్షలు రాయనున్నారని ఉదయభాస్కర్ తెలిపారు.
previous post