telugu navyamedia
క్రైమ్ వార్తలు తెలంగాణ వార్తలు వార్తలు

నిందితుడు శ్రీనివాసరెడ్డి ఫాస్ట్ ట్రాక్ కోర్టులో హాజరు

Court-Order

నల్లగొండ జిల్లా హాజీపూర్‌ గ్రామంలో వరుస హత్యల కేసులో నిందితుడు మర్రి శ్రీనివాస్‌రెడ్డిని పోలీసులు ఈరోజు ఫాస్ట్ ట్రాక్ కోర్టులో హాజరు పరిచారు. గ్రామంలో ముగ్గురు బాలికలు మనిషా, శ్రావణి, కల్పనల వరుస హత్య కేసులో నిందితుడు. అమ్మాయిలపై అత్యాచారం చేసి అనంతరం హత్యచేసి గుట్టుచప్పుడు కాకుండా శవాలు మాయం చేసినట్లు వెలుగు చూడడం గతంలో సంచలనమైంది.

దీంతో ప్రభుత్వం ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటు చేసింది. ఈ కోర్టుకు నిందితుడిని హాజరు పరచగా సెక్షన్ 313 కింద న్యాయమూర్తి వాంగ్మూలం నమోదు చేశారు. ఈ రోజు మధ్యాహ్నం హత్య కేసుల విచారణ ప్రారంభం కానుంది. సాక్ష్యుల వాంగ్మూలాలను నిందితుడికి చదివి వినిపించే ప్రక్రియ ఈ రోజు కొనసాగుతుంది. ఈ కేసుకు సంబంధించిన తీర్పు జనవరిలో వచ్చే అవకాశం ఉందని భావిస్తున్నారు.

Related posts