తెలంగాణలో ఉత్కంఠ రేపిన నాగార్జున సాగర్ ఉప ఎన్నికల్లో అధికార టీఆర్ఎస్ పార్టీ విజయం సాధించింది. సాగర్ ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి నోముల భగత్ కు అలాగే కాంగ్రెస్ నేత జానారెడ్డి నుంచి గట్టిపోటీ ఉంటుందని అనుకున్నారు. కానీ, ఎక్కడా అలాంటి పోటీ కనిపించలేదు. టీఆర్ఎస్ పార్టీ మొదటి రౌండ్ నుంచి స్పష్టమైన ఆదిక్యన్ని కనబరిచింది. టీఆర్ఎస్ పార్టీ నేత నోముల భగత్ 18వేలకు పైగా మెజారిటీ సాధించారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి జానా రెడ్డి విజయంపై నమ్మకం పెట్టుకున్నప్పటికీ ఓటర్లు మాత్రం కారువైపు మొగ్గుచూపారు. ఇక దుబ్బాక,హైదరాబాద్ మున్సిపల్ ఎన్నికల్లో మంచి ఫలితాలు సాధించిన బీజేపీ సాగర్ ఉపఎన్నికల్లో కనీస పోటీ కూడా ఇవ్వకుండా డిపాజిట్లు కూడా దక్కించుకోలేకపోయింది.
previous post
next post