telugu navyamedia
క్రైమ్ వార్తలు తెలంగాణ వార్తలు వార్తలు

రైలింజన్ ఢీకొని ముగ్గురు దుర్మరణం

traiin railway track

రైల్వే అధికారుల నిర్లక్ష్యం వల్ల తెలంగాణలో ముగ్గురు కార్మికులు మృతి చెందారు. మరో తొమ్మిది మంది తృటిలో ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నారు. వికారాబాద్ రైల్వే స్టేషన్ సమీపంలో ఉన్న రైల్వే బ్రిడ్జి వద్ద 12 మంది రైల్వే సిబ్బంది ట్రాక్‌కు పెయింటిగ్ పనులు చేస్తున్నారు. అదే సమయంలో హైదరాబాద్ నుంచి నుండి రైలింజన్ వికారాబాద్ వైపు వచ్చింది. ట్రాక్‌పై పనులు చేస్తున్న సిబ్బందికి ఎలాంటి సమాచారం లేదు.

రైలింజన్ దగ్గరికి వచ్చిన తరువాత రైల్వే ఉద్యోగులు గమనించారు. ట్రాక్‌పై నుండి తప్పుకునే క్రమంలో ముగ్గురిని రైలింజన్ ఢీ కోట్టింది. ఈ ముగ్గురు సిబ్బంది అక్కడిక్కడే మృతి చెందారు. మిగతా తొమ్మిది మంది ప్రమాదం నుండి తప్పించుకున్నారు. ఘటన స్థలాన్ని రైల్వే ఉన్నతాధికారులు పరిశీలించారు. ఈ మేరకు రైల్వే పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Related posts