పవర్ స్టార్ పవన్ కల్యాణ్, రానా దగ్గుబాటిల మల్టీస్టారర్ చిత్రం భీమ్లా నాయక్. హైదరాబాద్ లోని యూసఫ్ గూడ పోలీస్ గ్రౌండ్స్ లో బుధవారం “భీమ్లా నాయక్” సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగింది. ఈ కార్యక్రమానికి టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీ రామారావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
అయితే భీమ్లా నాయక్ ప్రీ-రిలీజ్ ఈవెంట్కు మంత్రి కేటీఆర్ హజరు కావడంపై సర్వత్ర ఆసక్తి నెలకొంది. ఈ నేపథ్యంలో “భీమ్లా నాయక్” టీమ్ గురించి , ఈ కార్యక్రమానికి హజరుకావడంపై నేడు(గురువారం) ఉదయం కేటీఆర్ ఆసక్తికరమైన పోస్ట్ చేశారు.
ఈ సందర్భంగా ఆయన ‘భీమ్లా నాయక్ మూవీ విడుదల సందర్భంగా మై బ్రదర్స్ పవన్ కల్యాణ్, రానా దగ్గుబాటి, తమన్, సాగర్ కే చంద్రలకు శుభాకాంక్షలు తెలిపేందుకు నా రోటిన్ లైఫ్ నుంచి కాస్తా విరామం తీసుకున్నాను’ అంటూ రాసుకొచ్చారు.
అలాగే ‘పద్మశ్రీ మొగిలయ్యగారు, శివమణి వంటి అద్భుతమైన సంగీత విద్వాంసులను ఈ సందర్భంగా కలుసుకోవడం చాలా సంతోషంగా ఉంది’ అని మంత్రి కేటీఆర్ తన ట్వీట్లో పేర్కొన్నారు.