ప్రభాస్ ప్రధాన పాత్రలో సుజీత్ దర్శకత్వం వహించగా, యూవీ క్రియేషన్స్ సంస్థ దాదాపు 300 కొట్లతో నిర్మించిన చిత్రం “సాహో”. ఈ చిత్రం భారీ అంచనాలతో ఆగస్టు 30న ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. యూవీ క్రియేషన్స్ నిర్మించిన ఈ చిత్రంలో నీల్ నితిన్ ముఖేష్, మురళీ శర్మ, జాకీ ష్రాఫ్, వెన్నెల కిశోర్, మందిరా బేడీ కీలక పాత్రల్లో నటించారు. శ్రద్ధా కపూర్ హీరోయిన్ గా నటించిన ఈ చిత్రానికి మిక్స్డ్ టాక్ వచ్చింది. అయినప్పటికీ మంచి వసూళ్లను రాబడుతోంది ఈ చిత్రం. సోమవారం వచ్చిన కలెక్షన్లతో మూడు వందల కోట్ల గ్రాస్ మార్కుని దాటేసింది సాహో. “సాహో” తెలంగాణలో స్ట్రాంగ్గా రన్ అవుతూ వుండగా, ఆంధ్రప్రదేశ్లో మాత్రం కొంచెం వెనుకబడ్డది. అయితే హిందీ బెల్ట్లో మాత్రం కలెక్షన్స్ మామూలుగా లేవు. హిందీ వెర్షన్కి నాలుగు రోజుల్లోనే రమారమిగా వంద కోట్ల నెట్ వసూళ్లు రావడం విశేషం. హిందీలో మామూలుగా సల్మాన్ ఖాన్ సినిమాలకి మాత్రమే ఫస్ట్ వీకెండ్లో వంద కోట్ల నెట్ వసూళ్లు వస్తుంటాయి. ఇక ఈ చిత్రం మూడు రోజుల్లోనే ప్రపంచ వ్యాప్తంగా 294 కోట్లు వసూలు చేయగా… సోమవారం కలెక్షన్స్తో ఇప్పుడు 300 కోట్ల గ్రాస్ సాధించి సంచలనంగా మారింది. ప్రపంచ వ్యాప్తంగా తెలుగు వర్షన్ ఇప్పటికే 60 కోట్లు దాటిపోయినట్లు తెలుస్తోంది. మంగళవారం నుంచి కలెక్షన్లలో మరింత భారీ తగ్గుదల ఉండడం సహజం. ఇక ఓవర్సీస్లో ఈ సినిమా రెండు మిలియన్ డాలర్ల క్లబ్లో చేరింది. అలాగే ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా 300 కోట్ల రూపాయల పైచిలుకు గ్రాస్ సంపాదించింది.