telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

శిల్పారెడ్డి, ఆమె భర్త వైరస్ బారిన పడ్డారు… కానీ… : నాగార్జున

again nagarjuna class to baba basker

హైదరాబాద్ లో రోజుకు వందల సంఖ్యలో కరోనా కేసులు నమోదవుతున్నాయి. ఇటీవల సమంత ఫ్రెండ్ కు కరోనా పాజిటివ్ రావడం, అంతకుముందు రోజే ఆమె సమంతను కలవడంతో అక్కినేని అభిమానులు ఆందోళన చెందారు. అయితే తాజాగా నాగార్జున ఈ విషయంపై స్పందించారు. ఈ విషయం పై తన ట్విట్టర్లో ఓ పోస్ట్ చేసాడు. ”ప్రపంచంలో కరోనా కేసులు పెరుగుతూనే ఉన్నాయి. అందువల్ల దానిని ఎదురించడానికి ఉన్న ఏకైక ఆయుధం మానసికంగా మరియు శారీరకంగా ఆరోగ్యంగా ఉండాలి. మా స్నేహితురాలు శిల్పారెడ్డి మరియు ఆమె భర్త వైరస్ బారిన పడ్డారు కానీ ఈ కారణంగా దానిని జయించి బయటకువచ్చారు” అని తెలియజేశారు. అలాగే శిల్పా రెడ్డి మాట్లాడిన ఓ వీడియోను తన ట్విట్టర్ అకౌంట్ లో పోస్ట్ చేసాడు నాగార్జున. అందులో ఆవిడ… ఓ ఫ్యామిలీ ఫ్రెండ్ ద్వారా మాకు కరోనా సోకింది అనే విషయాన్ని తెలిపారు.

Related posts