telugu navyamedia
వార్తలు వ్యాపార వార్తలు

నేడు స్థిరంగా బంగారం ధరలు…

Gold rates hike

కరోనా వైరస్‌ ప్రభావంతో బంగారం ధరలు ఇవాళ భారీగా పెరిగిపోయాయి. గత కొన్ని రోజులుగా బంగారం ధరలు క్రమంగా పెరిగిన విషయం తెలిసిందే. దీపావళి పండుగ అయిపోగానే బంగారం ధరలు దిగివచ్చాయి. దీపావళి కంటే ముందు బంగారం, వెండి ధరలకు రెక్కలు వచ్చాయి. కరోనా వైరస్‌ విజృంభించిన తర్వాత బంగారం ధరలు చుక్కలు చూపించిన ఇప్పుడు మళ్ళీ మార్కెట్ పుంజుకోవడంతో ధరలు తగ్గాయి. కానీ ఈరోజు ఢిల్లీలో హైదరాబాద్ లో బంగారం, వెండి ధరలు భారీగా పెరిగిపోయాయి. కరోనా అనంతరం 50 వేల ను దాటింది బంగారం. అయితే ఢిల్లీలో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర 60 పెరిగి రూ. 53,300 పలుకుతోంది. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర 40 పెరిగి రూ. 48,850 వద్ద ముగిసింది. ఇక హైదరాబాద్ విషయానికి వస్తే.. బంగారం ధరలు ఇవాళ స్థిరంగా ఉన్నాయి. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ. 50,950 వద్ద ఉండగా… 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 46,700 పలుకుతోంది. ఇక వెండి విషయానికి వస్తే రూ. 100 తగ్గి రూ.72,200 కి చేరుకుంది.

Related posts