నిజాముద్దీన్ మర్కజ్ చీఫ్ మౌలానా సాద్ ఖాతాలోకి గల్ఫ్ దేశాల నుంచి కోట్లాది రూపాయలు వచ్చి పడినట్టు ఢిల్లీ క్రైం బ్రాంచ్ పోలీసులు గుర్తించారు. విచారణలో భాగంగా తాము సేకరించిన వివరాలను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్కు అందించారు. మౌలానా సాద్తోపాటు అతడి సన్నిహితుల ఖాతాల్లోకి కూడా పెద్దమొత్తంలో సొమ్ము జమైనట్టు గుర్తించారు.
మౌలానా సాద్, అతడి ముగ్గురు కుమారులు, మేనల్లుడి ఖాతాల్లోకి గల్ఫ్ దేశాల నుంచి కోట్ల రూపాయలు జమ అయినట్టు సాద్ ఫాంహౌస్పై దాడి సందర్భంగా పోలీసులు గుర్తించారు. ఆ నిధులతో రూ. 2 కోట్ల విలువైన ఆస్తులు కొన్న డాక్యుమెంట్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అయితే, ఈ సొమ్ము హవాలా మార్గంలో వచ్చిందా? లేక మనీలాండరింగ్కు పాల్పడ్డారా? అనే కోణంలో ఈడీ దర్యాప్తు ప్రారంభించింది. నిజాముద్దీన్ లో సమావేశం పెట్టి దేశంలో కరోనా వైరస్ ప్రబలేందుకు కారణమయ్యారని పోలీసులు సాద్ పై కేసు నమోదు చేసి దర్యాప్తు సాగిస్తున్నారు.
చిన్న లొల్లి అని చెప్పడం కేసీఆర్కు సిగ్గుచేటు: ఎంపీ సంజయ్