telugu navyamedia
ఆంధ్ర వార్తలు ట్రెండింగ్ రాజకీయ వార్తలు

తిరుపతి ఉప ఎన్నిక : భారీ మెజారిటీ దిశగా వైసీపీ

ycp ap

తిరుపతి లోక్ సభ నియోజకవర్గ ఉప ఎన్నికకు కౌంటింగ్ ప్రశాంతంగా జరుగుతోంది. 144 సెక్షన్ లో ఈ కౌంటింగ్ జరుగుతోంది. తిరుపతిలోని ఎస్వీ ఆర్ట్స్ కాలేజీలో తిరుపతి, శ్రీకాళహస్తి, సత్యవేడు అసెంబ్లీ సెగ్మెంట్లకు సంబంధించిన ఓట్ల లెక్కింపు జరుగుతోంది. అయితే తిరుపతి లోక్ సభ ఉప ఎన్నికలో వైసిపి అభ్యర్థి గురుమూర్తి ఆధిక్యంలో ఉన్నారు. వైసీపీ అభ్యర్థి గురుమూర్తి 32397 ఓట్ల ఆధిక్యంతో కొనసాగుతున్నారు. ఇప్పటి వరకు వైసీపీకి 66958 ఓట్లు రాగా.. టిడిపికి 34561 ఓట్లు వచ్చాయి. కౌంటింగ్ మొదలైనప్పటి నుంచి వైసిపి అభ్యర్థి గురుమూర్తి ఆధిక్యంలో ఉండటం విశేషం.

Related posts