తిరుపతి లోక్ సభ నియోజకవర్గ ఉప ఎన్నికకు కౌంటింగ్ ప్రశాంతంగా జరుగుతోంది. 144 సెక్షన్ లో ఈ కౌంటింగ్ జరుగుతోంది. తిరుపతిలోని ఎస్వీ ఆర్ట్స్ కాలేజీలో తిరుపతి, శ్రీకాళహస్తి, సత్యవేడు అసెంబ్లీ సెగ్మెంట్లకు సంబంధించిన ఓట్ల లెక్కింపు జరుగుతోంది. అయితే తిరుపతి లోక్ సభ ఉప ఎన్నికలో వైసిపి అభ్యర్థి గురుమూర్తి ఆధిక్యంలో ఉన్నారు. వైసీపీ అభ్యర్థి గురుమూర్తి 32397 ఓట్ల ఆధిక్యంతో కొనసాగుతున్నారు. ఇప్పటి వరకు వైసీపీకి 66958 ఓట్లు రాగా.. టిడిపికి 34561 ఓట్లు వచ్చాయి. కౌంటింగ్ మొదలైనప్పటి నుంచి వైసిపి అభ్యర్థి గురుమూర్తి ఆధిక్యంలో ఉండటం విశేషం.
previous post