telugu navyamedia
రాజకీయ వార్తలు

జర్నలిస్ట్ పై దాడికి పాల్పడ్డ బాలకృష్ణ.. సోషల్ మీడియాలో క్షమాపణలు

Tdp mla Balakrishna apologized journalists

అనంతపురం జిల్లా హిందూపురం నియోజకవర్గం ఎన్నికల ప్రచారంలో జర్నలిస్ట్ పై ఎమ్మెల్యే సినీనటుడు నందమూరి బాలకృష్ణ దాడి చేసిన సంగతి తెలిసిందే. పలు విమర్శల నేపథ్యంలో దాడి ఘటనపై బాలకృష్ణ స్పందించారు. అక్కడ ఉన్న చిన్నపిల్ల మీద పడి వీడియో తీస్తున్నవారు అల్లరి మూకల పని అని భావించి వారిని వారించడం జరిగిందని స్పష్టం చేశారు. అక్కడ ఉన్నది మీడియా వారని ఆ తర్వాతే తెలిసిందన్నారు. అంతేకానీ ఉద్దేశపూర్వకంగా చేసింది కాదని స్పష్టం చేశారు. ఈ విషయంలో మీడియా మిత్రులకి బాధకలిగించి ఉంటే క్షమాపణలు కోరుతున్నట్లు బాలకృష్ణ సోషల్ మీడియా వేదికగా క్షమాపణలు చెప్పారు.

బుధవారం ఎన్నికల ప్రచారంలో భాగంగా బుధవారం జర్నలిస్ట్ పై బాలకృష్ణ చేయిచేసుకున్నారు. ప్రాణాలు తీస్తా అంటూ బూతుపురాణం చదివారు. బాంబులు వేయడం​ కూడా తెల్సు నాకు. కత్తి తిప్పడం కూడా తెల్సు అంటూ బాలయ్య బెదిరింపులకు పాల్పడ్డారు. కెమెరాలో చిత్రీకరించిన దృశ్యాలను డిలీట్ చెయ్యాలని తిట్టిపోశారు. ఆగ్రహంతో చెయ్యి కూడా చేసుకున్నారు. రాస్కెల్‌ మా బతుకు మీ చేతుల్లో ఉన్నాయిరా. నరికి పోగులుపెడతాను అని బెదిరింపులకు పాల్పడ్డాడు. జనం పెద్ద ఎత్తున తరలివస్తుండటంతో బాలకృష్ణ తన వ్యక్తిగత సిబ్బందితో కలిసి అక్కడ నుంచి జారుకున్నారు.

Related posts