హైదరాబాద్ లో సాహితి అనే వైద్య విద్యార్థిని అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. ఎల్బీ నగర్ లోని అలేఖ్య టవర్స్ 14వ అంతస్తు నుంచి దూకి బలవన్మరణం చెందినట్టు కుటుంబ సభ్యులు చెబుతున్నారు. అలేఖ్య ఉస్మానియా డెంటల్ కాలేజీలో చదువుతోంది.
సాహితి ఈ మధ్యాహ్నం తమ నివాసంలోని బాల్కనీ గ్రిల్స్ తొలగించి కిందికి దూకినట్టు ఆమె తల్లిదండ్రులు చెబుతున్నారు. ఎంబీబీఎస్ లో సీటు రాకపోవడంపై సాహితి మనస్తాపానికి గురైందని అంటున్నారు. దీనిపై సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని అనుమానాస్పద మృతి కేసు నమోదు చేసుకున్నారు.
రేవంత్ పై చట్ట ప్రకారమే చర్యలు తీసుకున్నాం: తలసాని