దేశంలో ఒమి క్రాన్ కేసులు…రోజు రోజుకు పెరుగుతుండడంతో కలకలం రేపుతోంది. తాజాగా ఆంధ్రప్రదేశ్ లో మరో ఒమిక్రాన్ కేసు నమోదు అయ్యింది. దీంతో ఏపీలో ఒమిక్రాన్ కేసుల సంఖ్య మూడు చేరింది. తూర్పుగోదావరి జిల్లా అయినవిల్లి మండలం నేదునూరు పెదపాలెంకు చెందిన మహిళకు ఒమిక్రాన్ సోకినట్లు వైద్యారోగ్యశాఖ అధికారులు వెల్లడించారు.
ఈ నెల 19న కువైట్ నుంచి విజయవాడ వచ్చిన మహిళకు ఆర్టీపీసీఆర్ పరీక్ష నిర్వహించగా కరోనా నిర్ధరణ అయింది. దీంతో ఆమె శాంపిల్స్ సేకరించి జీనోమ్ సీక్వెన్సింగ్ కోసం పంపారు. టెస్ట్ల్లో ఒమిక్రాన్ సోకినట్టు నిర్థారణ అయింది. దీంతో ఒమిక్రాన్ వచ్చిన మహిళను హోమ్ ఐసోలేషన్లో ఉంచినట్లు అదనపు డీఎంహెచ్వో వెల్లడించారు.
అలాగే మహిళ భర్త, పిల్లలకు పరీక్షించగా….కరోనా నెగిటివ్ నెగటివ్ వచ్చిందని, మరోసారి వైద్య పరీక్షలు నిర్వహిస్తామని తెలిపారు.