ఏపీ జలవనరుల శాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ పోలవరం ప్రాజెక్టు ఏరియాలో పర్యటించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. 2018 నాటికే పోలవరం పూర్తిచేస్తామని టీడీపీ నేతలు ప్రజలకు అబద్ధాలు చెప్పారని, కేవలం 30 శాతం పనులు మాత్రమే పూర్తయితే, 75 శాతం పనులు జరిగాయని చంద్రబాబు అవాస్తవాలు చెబుతున్నారని మండిపడ్డారు.
సీఎం జగన్ మాట ఇచ్చారంటే తప్పక నెరవేరుస్తారని తెలిపారు. ఈ సందర్భంగా టీడీపీ నేతలపై విమర్శనాస్త్రాలు సంధించారు. దేవినేని ఉమ అయితే ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నాడని వ్యాఖ్యానించారు. మానసికంగా ఇబ్బందులు పడుతున్న బాబు సింగపూర్ వెళ్లి చికిత్స చేయించుకోవడం మేలని దుయ్యబట్టారు. టీడీపీ నాయకులు అవాస్తవాలు చెప్పి 23 స్థానాలు గెలుపొందారని పేర్కొన్నారు.
కాంగ్రెస్ బాగుపడాలంటే ఉత్తమ్ తప్పుకోవాలి: రాజగోపాల్రెడ్డి