telugu navyamedia
తెలంగాణ వార్తలు

తిరుమలలో తెలంగాణ ప్రజాప్రతినిధుల సందడి..

తిరుమల వెంకన్న సన్నిధి తెలంగాణ ప్రజాప్రతినిధులతో సందడిగా మారింది. ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో ఇటీవల ఏకగ్రీవంగా ఎన్నికైన శాసనమండలి సభ్యులు, కొత్తగా పోటీచేయనున్న ఎమ్మెల్సీ అభ్యర్థులు స్వామివారి ఆశీసులు తీసుకున్నారు.

తెలంగాణ పౌరసరఫరాల మంత్రి గంగుల కమాలకర్, తెలంగాణ ఎమ్మెల్సీలు కేకే మహేంద్ర రెడ్డి,రాజు , ఎల్.రమణా , భాను ప్రసాద్ రావు ,ఎమ్మెల్యే వివేక్ గౌడ్, సినీనేపథ్య గాయని ఎస్పీ .శైలజా, రజనీకాంత్ కుమార్తె ఐశ్వర్య వేరు వేరుగా దర్శించుకున్నారు వీరికి ఆలయ అధికారులు దగ్గరుండి దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వేదపండితులు ఆశీర్వదించారు. ఆలయ అధికారులు పట్టువస్త్రంతో సత్కరించి స్వామివారి తీర్థప్రసాదాలు అందజేశారు.

అనంతరం తెలంగాణ రాష్ట్ర మంత్రి గంగుల కమాలకర్ ఆలయం వెలుపల మీడియాతో మాట్లాడుతూ మా తెలంగాణ ప్రజాప్రతినిధులతో కలసి స్వామివారిని దర్శించుకోవడం చాలా సంతోషంగా ఉందని తెలిపారు. అలాగే మేము ఎంతో కష్టపడి సాధించుకున్న తెలంగాణ ప్రజలందరూ సుఖసంతోషాలతో ఉండాలని ముఖ్యమంత్రి కేసీఆర్ ఆధ్వర్యంలో యాదాద్రి దేవాలయం, తెలంగాణ రాష్ట్రం మరింతగా అభివృద్ధి చెంది ప్రజలందరూ సుఖసంతోషాలతో ఉండేలా ఆశీర్వదించమని ఆదేవదేవుణ్ణి కోరుకున్నట్లు తెలిపారు.

Related posts