telugu navyamedia
తెలంగాణ వార్తలు

బీజేపీలోకి తీన్మార్ మల్లన్న..

తెలంగాణలో రాక్షస పాలన అంతమొందించేందుకే బీజేపీలో చేరానని తీన్మార్ మల్లన్న పేర్కొన్నారు. ఢిల్లీ బీజేపీ కార్యాలయంలో ఆయన తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ ఆధ్వర్యంలో బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు.

జనాధరణగల తీన్మార్ మల్లన్న బీజేపీలోకి రావడం సంతోషదాయకమని బండి సంజయ్ అభిప్రాయం వ్యక్తంచేశారు. తీన్మార్ మల్లన్న చేరికతో తెలంగాణలో బీజేపీని మరింత పటిష్టం చేస్తామని నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ అన్నారు.

Related posts