ట్విట్టర్ ద్వారా తన దృష్టికి వచ్చే సమస్యలపై తెలంగాణ మంత్రి కేటీఆర్ వెంటనే స్పందిస్తారన్న విషయం తెలిసిందే. తాజాగా కొమురంభీం జిల్లా నుంచి కేటీఆర్కు ఒకరు ఓ ట్వీట్ చేశారు.
జిల్లాలోని ‘పెంచికల్ పేట్ మండలంలోని ఎల్కపల్లి గ్రామం తోటపల్లి రాజ్యం భూమి లేని ఓ నిరుపేద దళిత కూలి కుటుంబం ఇది’ అంటూ అందులో పేర్కొన్నారు. గత సంవత్సరం అనారోగ్యంతో ఆ కూలీ మృతిచెందగా అతని భార్య కూడా గత వారం రోజుల క్రితం మృతి చెందిందని చెప్పారు.
వీరి ఆరుగురు ఆడ పిల్లలు అనాథలయ్యారని, తల్లిదండ్రులు మరణించడంతో దిక్కుతోచని స్థితిలో ఉన్నారని తెలిపారు. ఒకరు చేసిన ఈ ట్వీట్పై కేటీఆర్ స్పందించారు. ‘వారి బాగోగులను మేము చూసుకుంటాం’ అంటూ కేటీఆర్ ట్వీట్ చేశారు. స్థానిక కలెక్టర్ను సంప్రదించి ఇందుకు తగ్గ ఏర్పాట్లు చేయాలని తన సిబ్బందిని ఆదేశించారు.