telugu navyamedia
రాజకీయ వార్తలు

బంద్ కు మద్దతుగా ఢిల్లీలో తెలంగాణ భవన్ ముట్టడిస్తాం: నారాయణ

Narayana cpi

రేపు చేపట్టనున్న తెలంగాణ బంద్ కు మద్దతుగా ఢిల్లీలో తెలంగాణ భవన్ ముట్టడిస్తామని సీపీఐ నేత కె.నారాయణ అన్నారు. కేసీఆర్ ప్రభుత్వంపై జాతీయ మానవహక్కుల సంఘానికి ఫిర్యాదు చేసిన నారాయణ అనంతరం మీడియాతో మాట్లాడుతూ ఆర్టీసీ కార్మికుల ఉద్యమానికి సకల జనుల సమ్మెరీతిలో అన్ని పార్టీలు తోడ్పడుతున్నాయని అన్నారు.

ఆర్టీసీ కార్మికులది సెల్ఫ్ డిస్మిస్ కాదనీ, ముఖ్యమంత్రి కేసీఆరే రాజకీయ ఆత్మహత్యకు సిద్ధమయ్యారని విమర్శించారు. కేసీఆర్ ఇకనైనా ఒంటెద్దు పోకడలను విడనాడాలని అన్నారు. అర్టీసీ సమ్మె నేపథ్యంలో ఆరుగురు కార్మికులు బలయ్యారని, ఇంకెంతమంది చనిపోవాలని ప్రశ్నించారు. తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో 1200 మంది ప్రాణాలర్పించారన్నారు. వారి బలిదానాల పునాదిపై కేసీఆర్ ముఖ్యమంత్రి అయ్యారని విమర్శించారు.

Related posts