telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

తప్పుడు కేసులు పెట్టి జైళ్లకు పంపారు: చంద్రబాబు

chandrababu tdp ap

రాజధాని అమరావతి రైతులు చేస్తున్న ఉద్యమం 250 రోజులకు చేరింది. ఈ నేపథ్యంలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఘాటుగా స్పందించారు. రైతులు చేస్తున్నప్పటికీ ప్రభుత్వం స్పందించడం లేదని విమర్శలు గుప్పించారు. సుదీర్ఘ ఉద్యమాలు జరుగుతున్నా ఆందోళనకారుల బాధను వినడానికి పాలకులు ముందుకు రావడం లేదన్నారు. పైగా వేలాది మంది ఉద్యమకారులపై ప్రభుత్వం తప్పుడు కేసులు పెట్టి జైళ్లకు పంపిందని చంద్రబాబు అన్నారు.

రాజధాని ఉద్యమంలో 85 మంది రైతులు, రైతు కూలీలు, మహిళలు అమరులైనా ప్రభుత్వం తమాషా చూస్తోందని మండిపడ్డారు. రాజధాని అంశంపై అసెంబ్లీ రద్దు చేసి ఎన్నికలకు వెళ్లాలన్న మా డిమాండ్‌కు వైసీపీ ముందుకు రాలేదని దుయ్యబట్టారు . 3 ముక్కల నిర్ణయానికి 13 జిల్లాల ప్రజల మద్దతు లేనట్టే అన్నారు. అలాంటప్పుడు మొండిగా ముందుకు పోవడం నిరంకుశత్వమేనని అన్నారు.

Related posts