telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

మార్కెట్‌ కమిటీల ఏర్పాటుకు నోటిఫికేషన్‌

ap

ఏపీలోని వ్యవసాయ మార్కెట్‌ కమిటీల ఏర్పాటుకు ప్రభుత్వం శుక్రవారం నోటిఫికేషన్‌ జారీ చేసింది. దీంతో కొత్తగా 216 మార్కెట్‌ కమిటీలు రాష్ట్రంలో ఏర్పాటు కానున్నాయి. ప్రభుత్వ ఆదేశాల మేరకు అధికారులు ఇటీవల మార్కెట్‌ కమిటీల పునర్వ్యస్థీకరణను పూర్తి చేశారు.

ప్రతి నియోజకవర్గంలో తప్పనిసరిగా ఒక మార్కెట్‌ కమిటీ ఉండాలనే సూచనల మేరకు.. మార్కెట్‌ కమిటీలు లేని 25 నియోజకవర్గాలకు మార్కెట్‌ కమిటీలు ఏర్పాటు చేశారు. దీంతో మొత్తం కమిటీల సంఖ్య 191 నుంచి 216కు పెరిగింది. వీటిన్నింటికీ ఈ నెలాఖరులోపు కమిటీలు ఏర్పాటు చేయాలని మార్కెటింగ్, సహకారశాఖ ప్రత్యేక కార్యదర్శి మధుసూదనరెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. .

Related posts