కృష్ణానది నుంచి ఏపీ ప్రభుత్వం ఎక్కువ నీటినీ తరలిస్తోందని కృష్ణానది బోర్డుకు తెలంగాణ ఇంజినీర్ ఇన్ చీఫ్ ఫిర్యాదు చేశారు. కృష్ణానదినీటిని తరలిస్తూ ఏపీ ప్రభుత్వం తక్కువ చేసి చూపిస్తోందని ఫిర్యాదులో పేర్కొన్నారు. పోతిరెడ్డిపాడుకు జాయింట్ టీమ్ ను కూడా రానివ్వకుండా అడ్డుకుంటోందని తెలిపారు.
ఏపీ ప్రభుత్వంపై చర్యలు తీసుకోవాలని… లేకపోతే బోర్డుకు విశ్వసనీయత ఉండదని చెప్పారు. కృష్ణా, గోదావరి జలాల వినియోగంపై ఏపీ ప్రభుత్వంతో కలసికట్టుగా వ్యవహరిస్తామని ఓవైపు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ చెబుతుంటే, మరోవైపు బోర్డుకు తెలంగాణ ఇంజినీర్ ఇన్ చీఫ్ ఫిర్యాదు చేయడం ఇపుడు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది.