టీడీపీ అధినేత చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏపీలో కరోనా వ్యాప్తిని ముఖ్యమంత్రి జగన్ ఉద్దేశపూర్వకంగా దాచి పెడుతున్నారని చంద్రబాబు ఆరోపించారు. చంద్రబాబు బుధవారం సాయంత్రం మీడియాతో మాట్లాడారు. ‘‘రాష్ట్రంలో కరోనా కేసులు ఉన్నా కావాలనే దాచి పెడుతున్నారు.. రాష్ట్రానికి ఎంత మంది విదేశీయులు వచ్చారో ప్రభుత్వం సమాధానం చెప్పాలి.. కేంద్రం లెక్కల ప్రకారం 11వేల మంది ఏపీ కి వచ్చారు.. వారిపట్ల రాష్ట్ర ప్రభుత్వ చేపట్టిన పర్యవేక్షణ ఏమిటి? జగన్ కుమార్తెలు కూడా విదేశాల నుంచి వచ్చారని అంటున్నారు.. అలా వచ్చి ఉంటే వారినీ 14 రోజుల పర్యవేక్షణలో పెట్టాలి.. ’’ అంటూ చంద్రబాబు వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో ఐసోలేషన్ వార్డులు ఎక్కడెక్కడ పెట్టారని ప్రశ్నించారయన. ఏడాది అవుతున్నా తనను, తెలుగుదేశం పార్టీని తిట్టడం తప్ప రాష్ట్రం కోసం ఏం చేశారని ముఖ్యమంత్రిని ప్రశ్నించారు చంద్రబాబు. ప్రభుత్వానికి పట్టకపోయినా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరుతున్నానని, వీలైనంత వరకు ప్రయాణాలు వాయిదా వేసుకోవాలని చంద్రబాబు ప్రజలకు సూచించారు. కరోనాపై అవగాహన కల్పించే బుక్ లెట్ను విడుదల చేశారు చంద్రబాబు.
జగన్ ఢిల్లీ పర్యటన పై టీడీపీ నేతల విమర్శలు