telugu navyamedia
క్రీడలు ట్రెండింగ్ వార్తలు

స్మిత్ సెంచరీ… 300 పైగా పరుగులు చేసిన ఆసీస్…

ఆసీస్ పర్యటనలో భాగంగా భారత్-ఆసీస్ మధ్య జరుగుతున్న టెస్ట్ సిరీస్ లో నేడు మూడో టెస్ట్ రెండో రోజు ఆట జరుగుతుంది. అయితే నిన్న ఆట ముగిసే సమయానికి 2 వికెట్లు కోల్పోయి 166 పరుగులు చేసిన ఆసీస్ ను నేడు 338 పరుగులకు కట్టడి చేసారు భారత బౌలర్లు. లబుషెన్ (91) సెంచరీ ముందు పెవిలియన్ కు చేరుకోగా ఆసీస్ స్టార్ ఆటగాడు స్మిత్ (131) మాత్రం తన సెంచరీ పూర్తి చేసి ఆ సిరీస్ లో శాతం బాదిన తొలి ఆసీస్ ఆటగాడిగా నిలిచాడు. అయితే లబుషెన్ ఔట్ అయిన తర్వాత బ్యాటింగ్ కు వచ్చిన ఆసీస్ ఆటగాళ్లు అందరూ వరుసగా పెవిలియన్ కు చేరుకుంటున్న స్మిత్ చివరి వరకు నిలిబడాడు. కానీ ఆఖరి బ్యాట్సమెన్ క్రీజులోకి వచ్చిన తర్వాత ఎప్పుడు స్ట్రైక్ తన వాదనే ఉంచుకోవడానికి ప్రయత్నించినా స్మిత్ చివరికి రన్ ఔట్ కావడంతో ఆసీస్ ఇన్నింగ్స్ ముగిసింది. ఇక భారత బౌలర్లలో జడేజా 4 వికెట్లు, బుమ్రా, సైని రెండేసి వికెట్లు తీయగా సిరాజ్ ఒక్క వికెట్ పడగొట్టాడు. ప్రస్తుతం భారత ఇన్నింగ్స్ కొనసాగుతుంది. ఓపెనర్లు రోహిత్ శర్మ (11), గిల్ (14) వద్ద బ్యాటింగ్ చేస్తున్నారు. చూడాలి మరి ఈరోజు చివరి వరకు భారత్ వికెట్ కోల్పోకుండా బ్యాటింగ్ చేస్తుందా… లేదా అనేది.

Related posts