telugu navyamedia
తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

జైపాల్ రెడ్డి భౌతికకాయానికి కేసీఆర్ ఘన నివాళి

cm kcr jaioal reddy

మాజీ కేంద్రమంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత జైపాల్ రెడ్డి భౌతికకాయానికి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ నివాళులర్పించారు. జూబ్లీహిల్స్ లోని జైపాల్ రెడ్డి నివాసానికి వెళ్లి కేసీఆర్..ఆయన పార్థివదేహంపై పుష్పగుచ్చం ఉంచి అంజలి ఘటించారు. ఈ సందర్భంగా జైపాల్ రెడ్డి కుటుంబసభ్యులను ఓదార్చి, ధైర్యం చెప్పారు.

సీఎం కేసీఆర్ తోపాటు మంత్రి శ్రీనివాస్ గౌడ్, టీఆర్ఎస్ నేతలు కేకేశవరావు, గుత్తా సుఖేందర్ రెడ్డి, పల్లారాజేశ్వర్ రెడ్డి, పలువురు నేతలు జైపాల్ రెడ్డికి నివాళులర్పించిన వారిలో ఉన్నారు. రేపు మధ్యాహ్నం రాష్ట్రప్రభుత్వం అధికార లాంఛనాలతో జైపాల్ రెడ్డి అంత్యక్రియలు నిర్వహించనుంది.

Related posts