telugu navyamedia
రాజకీయ వార్తలు

మేఘాలయ అసెంబ్లీ స్పీకర్ కన్నుమూత

meghalaya speaker death

యునైటెడ్ డెమోక్రాటిక్ పార్టీ (యూడీపీ) అధినేత, మేఘాలయ అసెంబ్లీ స్పీకర్ డోంకుపర్ రాయ్ (64) కన్నుమూశారు. గత పది రోజులుగా అనారోగ్యంతో ఆయన బాధపడుతున్నారు. ఉన్నత వైద్యం నిమిత్తం హరియాణాలోని గురుగ్రామ్ మేదాంత ఆసుపత్రికి ఆయన్ని తరలించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆయన ఈరోజు తుదిశ్వాస విడిచారు. డోంకుపర్ రాయ్ భౌతికకాయాన్ని రేపు మేఘాలయాకు తరలించనున్నారు. డోంకుపర్ రాయ్ మృతిపై రాజకీయ ప్రముఖులు తమ సంతాపం ప్రకటించారు. డోంకుపర్ రాయ్ గతంలో మేఘాలయా ముఖ్యమంత్రిగా పని చేశారు.

Related posts