ఓ ప్రయాణికుడు మద్యం మత్తులో నగరంలోని మెట్రో రైలు ఎక్కి హల్చల్ చేశాడు. మొబైల్ ఫోన్లో పాట పెట్టి గట్టిగా అరుస్తూ నృత్యాలు చేశాడు. సికింద్రాబాద్ నుంచి తార్నాక వెళ్లే మెట్రో రైలులో ఈ ఘటన చోటుచేసుకుంది. తన మొబైల్లో పెట్టిన పాటలకు డ్యాన్సులు చేస్తూ ప్రయాణికులను ఇబ్బందులకు గురిచేశాడు.
తోటి ప్రయాణికులు ఇతని ప్రవర్తనను తమ ఫోన్లలో చిత్రీకరించారు. తాగుబోతు ప్రవర్తనపై ప్రయాణికులు మెట్రో సిబ్బంది దృష్టికి తీసుకెళ్లడంతో అతన్ని తార్నాక స్టేషన్లో కిందికి దించేశారు.