తెలంగాణలో మరో ఆర్టీసీ కార్మికుడు తనువుచాలించాడు. నల్గొండ జిల్లా దేవరకొండ బస్ డిపోలో డ్రైవర్గా పనిచేస్తున్న తుమ్మలపల్లి జైపాల్రెడ్డి ఆదివారం అర్ధరాత్రి గుండెపోటుతో మృతిచెందారు. నిన్నరాత్రి వరకు జైపాల్రెడ్డి సమ్మె కార్యక్రమాల్లో పాల్గొన్నారు. అర్ధరాత్రి ఆయనకు గుండెనొప్పి రావడంతో కుటుంబ సభ్యులు, తోటి కార్మికులు అంబులెన్సులో హైదరాబాద్కి తరలిస్తుండగా మార్గమధ్యంలో ప్రాణాలు విడిచారు. దీంతో దేవరకొండలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.
జైపాల్రెడ్డి మృతికి నిరసనగా డిపో వద్ద ఆర్టీసీ కార్మికులు, వివిధ పార్టీల నేతలు ధర్నా నిర్వహించారు.ఆర్టీసీ సమ్మె నేపథ్యంలో డ్రైవర్ జైపాల్రెడ్డి గత నెల రోజులుగా నిరసన కార్యక్రమాల్లో పాల్గొన్నాడు. మరో ఆరునెలల్లో రిటైర్ కానున్న జైపాల్రెడ్డి ఆర్టీసీ సమ్మె పట్ల ప్రభుత్వ వైఖరితో తీవ్ర ఆందోళన గురయ్యాడని కుటుంబ సభ్యులు చెప్తున్నారు. జైపాల్రెడ్డి మృతి నేపథ్యంలో ఆర్టీసీ జేఏసీ నేడు దేవరకొండ పట్టణ బంద్ పిలుపునిచ్చింది.