ప్రపంచ దేశాలను అల్లాడిస్తున్న కరోనా వైరస్ను కట్టడి చేసేందుకు భారత్కు అమెరికా రూ. 21 కోట్ల ఆర్థిక సాయం ప్రకటించింది. వైరస్పై పోరాటంలో భాగంగా 64 దేశాలకు అమెరికా అదనంగా మరో 174 మిలియన్ డాలర్ల నిధులు అందజేస్తున్నట్టు శనివారం తెలిపింది. ఇందులో భాగంగా భారత్కు 2.9 మిలియన్ డాలర్లు (దాదాపు రూ 21 కోట్లు) కేటాయించింది. కరోనా కట్టడికి అగ్రరాజ్యం ఇప్పటికే వంద మిలియన్ డాలర్ల ప్యాకేజీ ప్రకటించింది. తాజాగా మరింత కేటాయించింది.
కరోనాను ఎదుర్కొనేందుకు కేంద్రం దేశవ్యాప్తంగా లాక్ డౌన్ ప్రకటించింది. ఇందులో భాగంగా వైద్య రంగానికి ప్రధాని మోదీ రూ. 15 వేల కోట్ల నిధులు కేటాయిస్తున్నట్టు తెలిపారు. ఈ మొత్తాన్ని అదనపు ఐసోలేషన్ వార్డుల ఏర్పాటుకు, ఐసీయూ బెడ్స్ కోసం ఖర్చు చేస్తామని తెలిపారు.
ఈసీని నిందించడం సరికాదు.. చంద్రబాబుకు పురందేశ్వరి హితవు