telugu navyamedia
క్రైమ్ వార్తలు తెలంగాణ వార్తలు వార్తలు

చెరువులో ముగ్గురు అక్కాచెల్లెళ్ల మృతదేహాలు

New couples attack SR Nagar

తెలంగాణలోని కామారెడ్డి జిల్లాలో దారుణం జరిగింది. బాన్సువాడ మండలంలో విషాద ఘటన చోటుచేసుకుంది. రాజారామ్‌ దుబ్బ చెరువులో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు అక్కాచెల్లెళ్ల మృతదేహాలు బయటపడ్డాయి. సమాచారం అందుకున్న పోలీసులు చెరువు వద్దకు చేరుకుని మృతదేహాలను బయటకు తీశారు.

మృతులను అఫీయా(10), మహీన్‌(9), జోయా(7)గా పోలీసులు గుర్తించారు. అయితే తండ్రి ఫయాజ్‌.. ఈ ముగ్గురిని హత్య చేసి చెరువులో పడేసి ఉండొచ్చని గ్రామస్తులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఫయాజ్‌ను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ముగ్గురు చిన్నారుల మృతితో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.

Related posts