తెలంగాణ రాష్ట్రానికి వచ్చే పది సంవత్సరాలూ తానే సీఎంగా ఉంటానని, తన ఆరోగ్యం బాగానే ఉందని న్న అసెంబ్లీలో కేసీఆర్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ మహిళా నేత విజయశాంతి స్పందించారు. నిన్నకేసీఆర్ చేసిన ప్రకటన అయోమయంగా ఉందని ఆమె వ్యాఖ్యానించారు.
టీఆర్ఎస్ లో ఇప్పటికే అసమ్మతి పెరిగిపోయిందని, ఎంతోమంది కేసీఆర్ నిర్ణయాలను ఇప్పటికే బహిరంగంగా వ్యతిరేకించారని గుర్తు ఆమె గుర్తు చేశారు. అసమ్మతిని కట్టడి చేయడానికి, మేనల్లుడు హరీశ్ రావును సంతృప్తిపరచడానికే కేసీఆర్ మాట్లాడినట్టు అర్థం చేసుకోవచ్చని అన్నారు. టీఆర్ఎస్ లో ఉన్న అసంతృప్తిని కేసీఆర్ కట్టడి చేసే పరిస్థితి లేదని విజయశాంతి వ్యాఖ్యానించారు.