తెలంగాణలో కరోనా విజృంభణ కొనసాగుతూనే ఉంది. రోజు రోజుకు రికార్డు స్థాయిలో కేసులు పెరుగుతూనే ఉన్నాయి. రాష్ట్రంలో కరోనా కేసులు 3 లక్షలు దాటేశాయి. తెలంగాణ వైద్య ఆరోగ్యశాఖ విడుదల చేసిన తాజా కరోనా బులెటిన్ ప్రకారం.. గత 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 5926 కొత్త పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి.. ఇక 18 మంది కరోనాతో మృతి చెందారు. ఇదే సమయంలో 2209 మంది కరోనా బాధితులు కోలుకున్నట్టు బులెటిన్లో పేర్కొంది సర్కార్.. దీంతో.. పాజిటివ్ కేసుల సంఖ్య 3,61, 359 కు చేరగా.. రికవరీ కేసులు 3,16,650 కు పెరిగాయి.. మరోవైపు.. ఇప్పటి వరకు కరోనాబారినపడి 1856 మంది మృతి చెందారు.. రికవరీ రేటు దేశంలో 85.6 శాతంగా ఉంటే.. రాష్ట్రంలో 87.62 శాతంగా ఉందని సర్కార్ చెబుతోంది. ప్రస్తుతం రాష్ట్రంలో 42,853 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఇక, నిన్న ఒకే రోజు 122143 కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా.. ఇప్పటి వరకు నిర్వహించిన కోవిడ్ టెస్ట్ల సంఖ్య 1,19,42,985 కు చేరుకున్నట్లు బులెటిన్లో పేర్కొంది సర్కార్.
previous post
టీడీపీ అధికారంలోకి వస్తే హైద్రాబాద్ కంటే అభివృద్ధి: నటి దివ్యవాణి