వివాహేతర సంబంధం పెట్టుకున్నయువతిని తన భర్త ఇంటికి తీసుకొచ్చాడన్న మనస్తాపంతో ఓ భార్య ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటన విశాఖపట్నం జిల్లా నక్కపల్లిలో చోటు చేసుకుంది. టీచర్స్ కాలనీలో నివాసం ఉంటున్న కె.చినరాజు, నాగ వరలక్ష్మి(28) భార్యభర్తలు.వీరికి ఎనిమిదేళ్ల కిందట వివాహం జరిగినప్పటికీ సంతానం లేదు. చినరాజు మరో యువతితో వివాహేతర సంబంధం పెట్టుకోవడంతో ఈ విషయంపై అతడితో భార్య వరలక్ష్మి గొడవపడేది. ఈ విషయంలో భర్తతో చాలా సార్లు గొడవపడి పెద్ద మనుషుల ముందు పంచాయతీ కూడా పెట్టించి, వారితో భర్తకు బుద్ధి చెప్పించింది.
,వివాహేతర సంబంధం పెట్టుకున్న యువతిని అతడు శనివారం తన ఇంటికి తీసుకురావడంతో ఆమెతో వరలక్ష్మి గొడవపడింది. దీంతో వరలక్ష్మి ఇంటికి వచ్చిన ఆ యువతి అదే ఇంటిపైకి ఎక్కి కిందకు దూకడంతో ఆమెకు గాయాలయ్యాయి. ఆమె ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన వరలక్ష్మి ఇంట్లో ఫ్యాన్కు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.