telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

అర్హులతో సచివాలయ పోస్టులు భర్తీ చేయాలి: లోకేశ్ డిమాండ్

Nara Lokesh

అర్హులతో సచివాలయ పోస్టులు భర్తీ చేయాలని టీడీపీ ఎమ్మెల్సీ నారా లోకేశ్ డిమాండ్ చేశారు. సచివాలయ ఉద్యోగాల పరీక్ష పేపర్ లీకేజి నుంచి ఈ రోజు వరకు నిరుద్యోగులు దగా పడుతూనే ఉన్నారని తెలిపారు. గ్రామ సచివాలయం ఉద్యోగ నియామక పరీక్షలో అర్హత సాధించి, సర్టిఫికెట్ వెరిఫికేషన్ కూడా పూర్తయి ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్న వాళ్లు సుమారు 10 వేల మంది ఉన్నారని లోకేశ్ వివరించారు.సీఎం జగన్ రాష్ట్రంలోని నిరుద్యోగ యువతకు తీరని అన్యాయం చేస్తున్నారని విమర్శించారు.

మొదటి నోటిఫికేషన్ ద్వారా సచివాలయ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు అవకాశం కల్పించకుండా రెండో నోటిఫికేషన్ ఇవ్వడం ఏంటని ప్రశ్నించారు. ఖాళీగా ఉన్న పోస్టులకు, ప్రభుత్వం అదనంగా ప్రకటించిన 3 వేల సచివాలయ ఉద్యోగాలకు అర్హులు ఉండగా, మరో నోటిఫికేషన్ ఎందుకు ప్రకటించారని ప్రశ్నించారు. అర్హత సాధించిన వారందరికీ ఉద్యోగం కల్పిస్తామన్న జగన్ రెడ్డి హామీ ఏమైంది? అంటూ నిలదీశారు.

Related posts