telugu navyamedia
వార్తలు సినిమా వార్తలు

తాగిన మైకంలో అమ్మాయిలపై దౌర్జన్యానికి పాల్పడ్డ కోయిలమ్మ సీరియల్ హీరో…

కోయిలమ్మ సీరియల్ హీరో అమర్ తాగిన మైకంలో ఇద్దరు అమ్మాయిలపై దౌర్జన్యానికి పాల్పడ్డాడు. అయితే తమ పై అసభ్య పదజాలంతో మాట్లాడుతూ లైంగికంగా వేధింపులకు పాల్పడ్డాడని రాయదుర్గం పోలీసులను ఆశ్రయించింది శ్రీవిద్య. శ్రీవిద్య, స్వాతి, లక్ష్మీ కలిసి మణికొండ లో బౌటిక్ వ్యాపారం నిర్వహిస్తున్నారు. కొన్ని కారణాలవల్ల స్వాతి బౌటిక్ వ్యవపరం నుండి తప్పుకుంది. స్వాతికి రావాల్సిన కొన్ని వస్తువులు శ్రీవిద్య ఇవ్వకపోవడంతో నిన్న రాత్రి కోయిలమ్మ సీరియల్ హీరో సమీర్ అలియాస్ అమర్ తో కలిసి శ్రీవిద్య ఇంటికి వెళ్లారు. శ్రీవిద్య ఇంట్లో మాట మాట పెరిగి అది కాస్త గొడవకు దారి తీసింది. ఇట్టి విషయం పై ఒకరి పై ఒకరు రాయదుర్గం పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదులు చేసుకున్నారు. అయితే ఈ కేసు పై రాయదుర్గం సీఐ రవీందర్ మాట్లాడుతూ… శ్రీవిద్య స్వాతి రష్మీదీపి స్నేహితులు… రష్మీ దీప, స్వాతి లు బొటెక్ నడుపుతున్నారు. ప్రస్తుతం ఆ బొటెక్ ను శ్రీ విద్యా నడుపుతోంది. స్వాతి కి చెందిన మిషన్ శ్రీవిద్య దగ్గర ఉంది. ఆ మిషన్ ఖరీదు నాలుగు వేలు ఉంటుంది. ఈ మిషన్ పై రేగిన మనస్పర్థలు గొడవకు కారణమయ్యాయి.. అమర్ అనే యువకుడు స్వాతి తరుపున వచ్చాడు. కుట్టుమిషన్ కోసం స్నేహితులు మధ్య ఈ గొడవ జరిగింది. ఇరువురు పీఎస్ లో ఫిర్యాదు చేశారు. కేసు దర్యాప్తు చేస్తున్నాం అని తెలిపారు. చూడాలి మరి ఏం జరుగుతుంది అనేది.

Related posts