telugu navyamedia
ఆంధ్ర వార్తలు

టీడీపీ ఎమ్మెల్యేలకు రెండు రోజుల సస్పెన్షన్‌

ఏపీ అసెంబ్లీలో  టీడీపీ ఎమ్మెల్యేలు ఆందోళన లు కొన‌సాగించారు. స‌భ‌లో చిడతలు వాయించుకుంటూ నానా రచ్చ చేశారు. స్పీకర్ తమ్మినేని వద్దని వారించినా వినిపించకపోవడంతో వాటి లాక్కోవాలని సిబ్బందిని ఆదేశించారు.

ఎంత చెప్పినా టీడీపీ ఎమ్మెల్యేల తీరు మారకపోవడంతో సభ నుంచి రెండు రోజుల పాటు సభ్యులను సస్పెండ్‌ చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. టీడీపీ సభ్యులు ప్రజా ధనాన్ని వృథా చేస్తున్నారంటూ వారి తీరుపై స్పీకర్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు.

సస్పెండ్ అయిన వారిలో గొట్టిపాటి రవి,ఆదిరెడ్డి భవానీ,నిమ్మకాలయ్య చినరాజప్ప
పీజేవీ నాయుడు, జోగశ్వరరావులను ఉన్నారు.

Related posts