telugu navyamedia
ఆంధ్ర వార్తలు ట్రెండింగ్ వార్తలు

రెవెన్యూ శాఖ మంత్రిగా ధర్మాన కృష్ణదాస్ బాధ్యతలు

Dharmana

ఆంధ్ర ప్రదేశ్ రెవెన్యూ, స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ మంత్రిగా ధర్మాన కృష్ణదాస్ శనివారం బాధ్యతలు స్వీకరించారు. తెల్ల కార్డుదారులకు ఆదాయ ధ్రువీకరణ పత్రాలు ఇకపై నాలుగేళ్లపాటు చెల్లుబాటు అయ్యే విధంగా ఆయన తొలి సంతకం చేశారు. భూ సంబంధిత సమస్యలు, తగాదాల పరిష్కారానికి ఇకపై ఫ్రెండ్లీ వ్యవస్థకు శ్రీకారం చుడతామని చెప్పారు. రెవెన్యూ శాఖలో అవినీతి తావులేకుండా పారదర్శకంగా పనులు జరిగేలా కృషి చేస్తామన్నారు. రెవెన్యూ కార్యాలయాల ద్వారా అందే సేవలు గ్రామ, వార్డు సచివాలయల ద్వారా ప్రజలకు సత్వరమే అందేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. రాష్ట్రం మొత్తం భూమిని రీ సర్వే నిర్వహించి రికార్డులను ఆధునీకరిస్తామని ధర్మాన కృష్ణదాస్‌ తెలిపారు. కృష్ణదాస్‌ రెవెన్యూ శాఖతో పాటూ డిప్యూటీ సీఎంగా కూడా ఎన్నికైన విషయం తెలిసిందే.

Related posts