telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

నదీజలాల అనుసంధానానికి .. అఖిలపక్షం అవసరం .. : సిపిఎం

cpm demand all party meeting for Connectivity of rivers

సిపిఎం రాష్ట్ర కార్యదర్శి పి.మధు కృష్ణా-గోదావరి నదుల అనుసంధానంపై అఖిలపక్ష సమావేశం నిర్వహించాలంటూ ఏపీసీఎం వైఎస్‌ జగన్మోహనరెడ్డికి ఓ లేఖ రాశారు. నదుల అనుసంధానంపై తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రులు ఒక అవగాహనకు వచ్చినట్లుగా తెలంగాణ ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు గురువారం ఓ ప్రకటన విడుదల చేశారని లేఖలో పేర్కొన్నారు.

ఈ విషయంపై రాష్ట్ర ప్రభుత్వం తన వైఖరిని స్పష్టం చేయాలని, వాస్తవాలను ప్రజలకు తెలపాలని కోరారు. ఈ అంశంపై అఖిలపక్ష సమావేశం నిర్వహించిన తర్వాతే రాష్ట్రప్రభుత్వం దీనిపై ముందుకు పోవడం సమంజసంగా ఉంటుందని తెలిపారు. రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా అఖిలపక్ష సమావేశాన్ని తక్షణమే నిర్వహించాలని కోరారు.

Related posts