telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

బాత్‌రూమ్‌లకు కూడా వైసీపీ రంగులు: చంద్రబాబు ఫైర్

chandrababu

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంపై టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు విరుచుకుపడ్డారు. ప్రభుత్వ కార్యాలయాలకు, ఇతర నిర్మాణాలకు పార్టీ జెండా రంగులు వేయడం, ఆ రంగులు తొలగించాలని కోర్టు తీర్పు ఇవ్వడం పట్ల చంద్రబాబు ఘాటుగా స్పందించారు. మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ రంగులు వేయడానికి, మళ్లీ తొలగించడానికి దాదాపు రూ.3000 కోట్ల ప్రజాధనం దుర్వినియోగం అవుతుందని మండిపడ్డారు.

పంచాయతీ భవనాలకు వైసీపీ రంగులు తొలగించాలని హైకోర్టు ఆదేశించిందని చంద్రబాబు అన్నారు. హైకోర్టు ఆదేశాల ప్రకారం వైసీపీ రంగులు తొలగించకపోతే మేమే రంగంలోకి దిగుతామని చంద్రబాబు హెచ్చరించారు. చేస్తున్నారని, ఎవడబ్బ సొమ్ము అని ఖర్చు చేస్తున్నారంటూ మండిపడ్డారు. ఈ డబ్బు వైసీపీ నాయకులు కడతారా? అని ప్రశ్నించారు.బాత్‌రూమ్‌లను కూడా వదిలిపెట్టకుండా రంగులేస్తున్నారని చంద్రబాబు విమర్శించారు. అనంతపురంలో జాతీయ జెండాకు కూడా వైసీపీ రంగు వేశారని మండిపడ్డారు.

Related posts