తెలంగాణలోని ప్రభుత్వ, ప్రయివేటు పాఠశాలలకు ఈ నెల 16 నుంచి ఒంటిపూట బడులు ప్రారంభమవుతాయని పాఠశాల విద్యా కమిషనర్ చిత్రారామచంద్రన్ ప్రకటన చేశారు. ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 12:30 గంటల వరకు పాఠశాలలు పని చేయనున్నాయి.
మధ్యాహ్నం 12:30 గంటలకు మధ్యాహ్న భోజనం అనంతరం విద్యార్థులను ఇంటికి పంపించనున్నారు. ఏప్రిల్ 23వ తేదీ నుంచి పాఠశాలలకు వేసవి సెలవులు ప్రకటించనున్నారు. జూన్ మాసంలో పాఠశాలలు పున: ప్రారంభం కానున్నాయి.
ప్రజలిచ్చిన శక్తితోనే నేనిలా నిలబడ్డా- సీఎం కేసీఆర్