telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

గ్యాస్ లీకేజ్ ఘటనపై కేంద్రానికి చంద్రబాబు లేఖ

chandrababu

విశాఖపట్నంలోని ఆర్‌ఆర్‌ వెంకటాపురంలో ఓ కంపనీ నుంచి గ్యాస్‌ లీకైన ఘటనపై కేంద్ర ప్రభుత్వానికి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు లేఖ రాశారు. ఈ ఘటనలో దాదాపు 2,000 మంది అనారోగ్యానికి గురి కావడం దురదృష్టకరమని చంద్రబాబు అందులో పేర్కొన్నారు. ప్రజారోగ్యంపై తగు చర్యలు తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వాన్ని చంద్రబాబు కోరారు.

నిపుణులైన వైద్య సిబ్బందిని పంపాలని విజ్ఞప్తి చేశారు. పశువులూ చనిపోతోన్న నేపథ్యంలో పశు వైద్యులను కూడా పంపాలని ఆయన అందులో పేర్కొన్నారు.ప్రమాద ఘటనపై పూర్తి స్థాయిలో విచారణ జరిపించాలని ఈ మేరకు కేంద్ర పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్‌ను ఆయన కోరారు. పరిశ్రమలను కాలుష్యం లేని ప్రత్యేక ప్రాంతాలకు తరలించాల్సి ఉందని పేర్కొన్నారు.

Related posts