రవిచంద్రన్ అశ్విన్పై ఆరు నెలల నిషేధం పడకుండా.. బీసీసీఐ అంతర్జాతీయ క్రికెట్కు దూరంగా ఉంచారని పాకిస్తాన్ మాజీ స్పిన్నర్ సయీద్ అజ్మల్ ఆరోపించాడు. తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో సయీద్ అజ్మల్ మాట్లాడుతూ… ‘ఎవర్నీ సంప్రదించకుండానే అన్ని నిబంధనలూ మార్చేస్తారు. గత ఎనిమిదేళ్లుగా క్రికెట్ ఆడుతూనే ఉన్నా. ఆ నిబంధలన్నీ నాకే వర్తించాయి. అదే సమయంలో రవిచంద్రన్ అశ్విన్ ఆరు నెలలు క్రికెట్కు దూరంగా ఉన్నాడు. ఎందుకంటే.. అశ్విన్పై నిషేధం పడకుండా భారత క్రికెట్ నియంత్రణ దూస్రాలు విసిరేందుకు అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) 15 డిగ్రీల నిబంధనను పక్కన పెట్టాలని వెటరన్ ఆఫ్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ కోరినట్టు ఈ మధ్యే వార్తలు రావడం గమనార్హం. అయితే తానెప్పుడూ అలా కోరలేదని, అవన్నీ అవాస్తవాలని యాష్ స్పష్టం చేశాడు. ఇక ఇప్పటి వరకూ 78 టెస్టుల్లో 409 వికెట్లు తీసిన రవిచంద్రన్ అశ్విన్.. కెరీర్లో మొత్తం 30 సార్లు ఒక ఇన్నింగ్స్లో 5 కంటే ఎక్కువ వికెట్లు తీశాడు.
previous post