telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

ఉత్తమ వ్యవస్థకు రూపం ఇచ్చిన పాలకుడు శ్రీరాముడు: చంద్రబాబు

chandrababu

టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ప్రజలకు శ్రీరామ నవమి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన పలు వ్యాఖ్యలు చేశారు. ‘ఏ ప్రాంత ప్రజలైనా రామరాజ్యం కావాలని కోరుకుంటారు. ఎందుకంటే ఒక ఉత్తమ వ్యవస్థకు రూపం ఇచ్చిన ఉత్తమ పాలకుడు శ్రీరాముడు. అధికారాన్ని ప్రజోపయోగంగా ఎలా వినియోగించాలో రాముడు మనకు తెలియచెప్పాడు. అందుకే గాంధీజీ సైతం స్వతంత్ర భారతదేశం రామరాజ్యంలా విలసిల్లాలని కోరుకున్నారు’ అని ట్వీట్లు చేశారు.

‘విభజన కారణంగా భద్రాద్రిని కోల్పోయిన ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఆ లోటు కనపడనీయకుండా, కడప జిల్లాలో 450 ఏళ్ల చరిత్ర కలిగిన ఒంటిమిట్ట కోదండ రామాలయాన్ని రూ.100కోట్లతో అభివృద్ధి చేసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. ప్రతిఏటా నవరాత్రి ఉత్సవాలను ఘనంగా నిర్వహించే ఏర్పాట్లు చేశాం’ అని చంద్రబాబు చెప్పారు. అలాంటిది గత ఏడాదిగా ఒంటిమిట్ట కోదండ రామాలయ అభివృద్ధి పనులు ఆగిపోవడం బాధాకరమని అన్నారు.

Related posts