telugu navyamedia
క్రీడలు వార్తలు

ఐపీఎల్ 2021 : ముంబై ఖాతాలో మొదటి విజయం

ముంబై ఇండియన్స్-కోల్‌కత నైట్ రైడర్స్ మధ్య మ్యాచ్ చాలా రసవత్తరంగా సాగింది. ఇందులో టాస్ గెలిచి బౌలింగ్ తీసుకున్న కోల్‌కత ముంబైని ఆల్ ఔట్ చేసింది. ఈ జట్టులో సూర్య కుమార్ యాదవ్(56) అర్ధశతకంతో అలాగే కెప్టెన్ రోహిత్ శర్మ(43) పరుగులతో రాణించిన మిగిత ఆటగాళ్లు అందరూ వరుసగా పెవిలియన్ ధరి పట్టడంతో ముంబై నిర్ణిత 20 ఓవర్లలో 10 వికెట్లు కోల్పోయి 152 పరుగులు చేసింది ముంబై. ఇక 153 పరుగుల మాములు లక్ష్యంతో బరిలోకి దిగ్గిన కోల్‌కత ఛేజింగ్ ను బాగానే ప్రారంభించింది. ఆ జట్టు ఓపెనర్లు నితీష్ రానా(57), గిల్(33) తో మంచి స్టార్ ఇచ్చిన తర్వాత వచ్చిన ఆటగాళ్లు దానిని కొనసాగించలేకపోయారు. చివర్లో ముంబై బౌలర్లు కట్టుదిట్టమైన బంతులు విసరడంతో కేకేఆర్ 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి కేవలం 142 పరుగులు మాత్రమే చేసింది. దాంతో ముంబై 10 పరుగుల తేడాతో విజయం సాధించింది.

Related posts