telugu navyamedia
ఆంధ్ర వార్తలు తెలంగాణ వార్తలు వార్తలు సామాజిక

మచిలీపట్నం-సికింద్రాబాద్‌కు పది ప్రత్యేక రైళ్లు

Attack Railway TTI in Danapur express

ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని దక్షిణమద్య రైల్వే పది ప్రత్యేక రైళ్లను నడిపేందుకు ఏర్పాట్లు చేసింది. మచిలీపట్నం నుంచి సికింద్రాబాద్‌ వరకు ప్రత్యేక రైళ్లను నడిపిస్తునట్లు రైల్వే ముఖ్య ప్రజాసంబంధాల అధికారి సీహెచ్‌ రాకేష్ కుమార్‌ తెలిపారు. 07049 నంబర్‌ కలిగిన మచిలీపట్నం-సికింద్రాబాద్‌ స్పెషల్‌ రైలు మార్చి 3, 10, 17, 24, 31 తేదీల్లో మచిలీపట్నం నుంచి మధ్యాహ్నం 3.05 గంటలకు బయలుదేరి అదే రోజు రాత్రి 10.45 గంటలకు సికింద్రాబాద్‌కు చేరుకుంటుంది.

07050 సికింద్రాబాద్‌-మచిలీపట్నం రైలు 3, 10, 17, 24, 31 తేదీల్లో సికింద్రాబాద్‌లో రాత్రి 11.35 గంటలకు బయలుదేరి మరుసటి రోజు ఉదయం 8.55 గంటలకు మచిలీపట్టణానికి చేరుకుంటుంది. ఈ రైలు పెడన, గుడివాడ, విజయవాడ, గుంటూరు, సత్తెనపల్లి, మిర్యాలగూడ, నల్లగొండ స్టేషన్లలో ఆగనుంది. ప్రయాణీకులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని రైల్వే అధికారులు తెలిపారు.

Related posts