దేశ వ్యాప్తంగా కరోనా విస్తరిస్తున్న నేపథ్యంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్ని రాష్ట్రాల సీఎంలతో మోదీ వీడియో కాన్ఫరెన్స్లో మాట్లాడుతున్నారు. ఈ వీడియో కాన్ఫరెన్స్లో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా, రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ కూడా పాల్గొంటున్నారు. ఈ సందర్భంగా పలు అంశాలను ఏపీ సీఎం మోదీ దృష్టికి తీసుకొచ్చారు. లాక్ డౌన్ నేపథ్యంలో ఏపీ ఆదాయం బాగా దెబ్బతిందని జగన్ తెలిపారు. రాష్ట్రాన్ని ఆదుకోవాలని ఆయన మోదీని కోరారు. కరోనా విజృంభణ నేపథ్యంలో వైద్య పరికరాలను అందించాలని చెప్పారు.
రాష్ట్రంలో రెండు రోజుల్లో కేసులు వేగంగా పెరిగిపోయిన తీరును వివరించారు. ఇప్పటివరకు 132 కేసులు నమోదయ్యాయని, వారిలో 111 మంది ఢిల్లీలో జరిగిన జమాత్ సభకు వెళ్లిన వారు, వారితో సన్నిహితంగా ఉన్నవారేనని చెప్పారు. కుటుంబాల వారీగా సర్వే చేస్తున్నామని తెలిపారు. కరోనా లక్షణాలు ఉన్నవారికి క్వారంటైన్కు తరలిస్తున్నామని చెప్పారు.